ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగానే నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 10,171 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,06,960 కు చేరింది. కొత్తగా 7594 మంది వైరస్ నుంచి కోలుకోగా… మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,20,464 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 89 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని మృతి చెందిన వారి సంఖ్య 1842కు చేరింది.
గడిచిన 24 గంటల్లో కర్నూలులో జిల్లాలో 1331, తూర్పు గోదావరిలో 1270, అనంతపురంలో 1100, చిత్తూరులో 980, నెల్లూరులో 941, విశాఖపట్నంలో 852, గుంటూరులో 817, కడపలో 596, పశ్చిమ గోదావరిలో 548, విజయనగరంలో 530, శ్రీకాకుళంలో 449, కృష్ణాలో 420, ప్రకాశం జిల్లాలో 337 కేసులు నమోదయ్యాాయి.