LATEST NEWS

జనసేనలోకి భారీగా చేరికలు

కండువా కప్పి ఆహ్వానిస్తున్న సందీప్ పంచకర్ల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకి బలపడుతుంది అనే చెప్పాలి, జనసేన సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ కండువా కప్పుకుంటున్నారు.. అలాగే పవన్ కళ్యాణ్ గారు అనుసరిస్తున్న విడి విధానాలు నచ్చి పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నరు అనే చెప్పాలి..

శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తగరపువలసలో భారీ సంఖ్యలో యువత మహిళలు జనసేన పార్టీలో చేరారు. నియోజకవర్గం ఇంఛార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల వారందరికీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జనసేనాని నాయకత్వంలోనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్న నమ్మకాన్ని పార్టీలో చేరిన మహిళలు వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ సందీప్ పంచకర్ల మాట్లాడుతూ.. మహిళా సాధికారిత, రేపటి తరం యువ భవిష్యత్తు కోసం జనసేన పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. జనసేన-బీజేపీల కూటమి బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్రతి ఒక కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి పార్టీ నాయకులు బి.వి. కృష్ణయ్య, వీరమహిళ పరిమి భువనేశ్వరిలు అధ్యక్షత వహించారు. పార్టీ నాయకులు సతీష్, వంశీ, కిరణ్, గోపీ, రాజు, రోహిత్, సాయి, కె. సతీష్ తో పాటు పలువురు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *