కర్నూలు జిల్లా పత్తికొండ లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు, దీనిపై కర్నూలు జిల్లా జనసేన నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు, అలాగే ఈ సంఘటనను నిరసిస్తూ జనసేన నాయకులు ,రాయలసీమ పార్లమెంట్ సంయుక్త కమిటీ సభ్యులు చింత సురేష్ బాబు చలో పత్తికొండ పేరుతో పిలుపునిచ్చారు, అయితే కర్నూలు జిల్లా పోలీస్ యంత్రాంగం జనసేన నాయకులను జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి హౌస్ అరెస్ట్ చేశారు,
జనసైనికులను అర్ధరాత్రి హౌస్అరెస్ట్ చేసి హక్కులను కాలరాస్తున్న ఈ ప్రభుత్వ వైఖరిపై కర్నూలు నగరంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా చింతా సురేష్బాబుగారు మాట్లాడుతూ పత్తికొండలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని అలాగే మండపేటలో మేరిమాతవిగ్రహాన్ని ధ్వంసంచేయడం ప్రభుత్వనిర్లక్షాన్ని ప్రతిబింబిస్తోందని పైపెచ్చు కొడాలినాని, రోజాలాంటి వైసిపి నాయకులు మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్నారు. అసలు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లిశ్రీనివాస్ పూర్తిగా విఫలమయ్యాడు అతనిని వెంటనే గవర్నర్ బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా సురేష్బాబుగారు గట్టిగా డిమాండ్ చేశారు.ఇలాగే వ్యవహరిస్తే యువజన రైతు కాంగ్రెసు పార్టీ కనుమరుగుకావడం ఖాయమన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసేన మంజునాథ్, నాగేష్ అరిగెల, బజారి,సుధాకర్, రాంబాబు, శ్రీనివాసరెడ్డి,లక్ష్మన్న, భాస్కర్ పాల్గొన్నారు..