ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్మోహన్ రెడ్డి కి సూచనలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ..మీ పై క్రైస్తవునిగా ముద్రపడింది కనుక ఈ నెలలో తిరుమలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే సందర్భంలో డిక్లరేషన్ పై సంతకం చేయండి.
ఆ తర్వాతే శ్రీవారిని దర్శించుకోండి గోటితో పోయే దాన్ని గొడ్డలి గాక ఎందుకు..? ఒక్క సంతకమే కదా పెట్టేయండి అప్పుడు మిమ్మల్ని సెక్యూలర్ గా భావిస్తారు, హిందువుల హృదయాలలో గౌరవంగా నిలిచిపోతారు’ అంటూ మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి కి హితవు పలికారు.