శ్రీ కృష్ణునికి శృతదేవి అనె మేనత్త ఉండేది.అమెకు శిశుపాలుడు అనె వికృత రూపమైన కుమారుడు జన్మించాడు.ఎవరిచేయి పడితే పిల్లవాడు మాములు రూపానికి మారతాడో అతని చేతిలోనే మరణిస్థాడు అని ఆమెకు చెప్పారు.ఒకరోజు శ్రీ కృష్ణుడు తన మేనత్త ఇంటికి వస్తాడు.
శృతదేవి తన కుమారుడుని కృష్ణుని చేతిలోఉంచి లోపలికి వెళ్తుంది.శిశుపాలుడు మాములు రూపానికి మారడంతో శృతదేవి సంతోషిస్తుంది కానీ కృష్ణుని చేతిలో మరణిస్తాడాని బాధపడి తన కొడుకుని చంపకూడదని వేడుకుంటుంది.అప్పుడు కృష్ణుడు కరిగిపోయి సరే వంద తప్పులు దాటితే మాత్రం చంపుతానని వరమిచ్చాడు.
శిశుపాలుడు పెరిగి చేధీ అనే రాజ్యానికి రాజయాడు. అందరినీ క్రూరంగా హింసిస్తూ తప్పులుచేస్తూ వుండేవాడు. ఒకరోజు సభలో అందరిముందు శ్రీకృష్ణుని దూషిస్తు ఉంటాడు.అప్పటికి వంద తప్పులు దాటడంతో కృష్ణుడు ఆవేశం తట్టుకోలేక తన సుదర్శన చక్రాన్ని శిశుపాలుడు మీదకు వదులుతాడు.
ఆవేశంతో సుదర్శన చక్రాన్ని వదిలినపుడు కృష్ణుని చేతికి చిన్న గాయం కావడంతో ద్రాపతి తన చీర కొంగుతో గాయానికి రక్షగా కడుతుంది. అప్పుడు కృష్ణుడు నా చెల్లిగా నీకూ ఎప్పుడు తోడుగా వుంటాను అని చెప్తాడు.
ఆ రక్షనే ప్రతి శ్రావణ పూర్ణిమని రాఖీ పూర్ణిమగా జరుపుకుని,ప్రతి చెల్లి అన్నకి రక్షగా రాఖీ కడుతుంది.