ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నడుపుతున్న వైన్ షాప్ లో ఒక రకానికి చెందిన మధ్యం పేరు ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది, మద్యానికి ‘ప్రెసిడెంట్ మెడల్’ అనే పేరు పెట్టడంపై సోషల్ మీడియాలో విపరతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి, రోజుకో కొత్త బ్రాండ్ పేరుతో పుట్టుకొస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ పేరు వివాదాస్పదం అయ్యింది,
మద్యానికి ప్రెసిడెంట్ మెడల్ అని పెట్టడంపై నెల్లూరులో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఎంతో గౌరవప్రదమైన ‘ప్రెసిడెంట్ మెడల్’ పేరును మద్యానికి పెట్టడం దారుణమని టీడీపీ నగర ఇంచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్లెక్సీకి మద్యం బాటిల్ను ‘మెడల్’గా వేసి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు 30 మంది నాయకులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు.
మరో వైపు వైసీపీ నేతలు వాదన భిన్నంగా ఉంది, ఈ బ్రాండ్ కు అనుమతులు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమే అంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.